ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ వెళ్లనున్న వైఎస్‌ జగన్

-

BREAKING : ఇవాళ ఢిల్లీకి వెళ్ళనున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి జగన్‌. ఈ నెల 16వ తేదీన ఢిల్లీకి వెళ్ళి… ప్రధాని మోడీతో భేటీ అయ్యారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. అయితే.. ఇప్పుడు హఠాత్తుగా రెండో సారి ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.

రెండు వారాల్లోపే సీఎం ఢిల్లీ పర్యటన పై ఉత్కంఠత నెలకొంది. దీనిపై ప్రతి పక్షాలు కూడా ఆరా తీస్తున్నాయి. కాగా..ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల అంశంలో ఆ రాష్ట్ర సర్కార్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కేసు విచారణ త్వరగా చేపట్టాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్న తో కూడిన ద్విసభ్య ధర్మా సనం తిరస్కరించింది. జులై 11న తొలి కేసుగా విచారణకు తీసు కుంటామని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news