హిమాన్షు శరీరంపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు.. వైయస్ షర్మిల సంచలన ట్వీట్

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు పై తీన్మార్ మల్లన్న.. తనక్ యు న్యూస్ ఛానల్ సోషల్ మీడియా లో నిర్వహించిన పోల్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద దుమారాన్ని రేపుతోంది. తెలంగాణలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని ఆ పోల్ లో నెటిజన్లను ప్రశ్నించాడు తీన్మార్ మల్లన్న. భద్రాచలం గుడిలోనా?; హిమాన్షు శరీరంలో నా? అంటూ పోల్ నిర్వహించాడు తీర్మానం మల్లన్న. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులు లాగడం ఏంటని ప్రజా ప్రతినిధులు మండిపడుతున్నారు. అయితే దీనిపై తాజాగా వైయస్ షర్మిల కూడా స్పందించారు. కుటుంబ సభ్యులను తీన్మార్ మల్లన్న లాగడం పై వైయస్ షర్మిల మండిపడ్డారు. “ఒక తల్లిగా, ఒక రాజకీయ నాయకురాలిగా దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. పిల్లలను, మహిళలు రాజకీయాల్లోకి లాగడం, కించపరచడం లాంటి చర్యలు సిగ్గుమాలిన రాజకీయాలు. దీనిపై రాజకీయాలకు అతీతంగా అందరూ స్పందించాలి. ” అంటూ ట్వీట్ చేశారు వైయస్ షర్మిల. అంతే కాదు మంత్రి కేటీఆర్ ను ఈ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news