వివేకా హత్య కేసు : జగన్ సన్నిహితున్ని ప్రశ్నించనున్న సీబీఐ

-

కడప : మాజీ మంత్రి వైస్ వివేకా నంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ హత్య కేసులో చాలా మంది అనుమానితులను ప్రశ్నించిన సీబిఐ.. విచారణలో మరింత దూకుడు పెంచింది. తాజా వైఎస్ కుటుంబం సమీప బంధువులు, సన్నిహితుల పైన దృష్టి సారించింది సీబిఐ బృందం.

ఈ నేపథ్యంలోనే నేడు సీఎం జగన్ కు, వైఎస్ కుటుంబానికి సన్నిహితు డైన దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి ని విచారించ నున్నట్లు సమాచారం అందుతోంది. నేడు విచారణకు హాజరు కావా లని ముందస్తుగా దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి ని సీబిఐ అధికారులు పిలిచినట్లు సమాచారం అందుతోంది. గతంలో కూడా శివశంకర్ రెడ్డిని విచారించిన సిట్, సీబిఐ బృందాలు.. తాజాగా మరోసారి విచారించనున్నారు. మాజీ మంత్రి వైస్ వివేకా నంద రెడ్డి హత్య చేసిన ఆయుధాల విషయం పై దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news