నేడే వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు విడుదల..వారి ఖాతాల్లో రూ.4 వేలు

-

ఏపీ రైతులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ఇవాళ రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు సీఎం జగన్‌. ఇందులో భాగంగానే.. ఇవాళ సీఎం వైయస్‌ జగన్‌ నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ పర్యటించనున్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం రెండో విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇవాళ జగన్‌ పాల్గొంటారు.

ఉదయం 9.00 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. 10.15 గంటలకు ఆళ్ళగడ్డ చేరుకోనున్నారు. 10.45 – 12.10 గంటలకు వైపీపీఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్.

వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ రెండో విడత నగదు బదిలీని వర్చువల్ గా రైతుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్.. మధ్యాహ్నం 2.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు. ఏకంగా 50.92 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4 వేల చొప్పున డబ్బులు జమ చేయనున్నారు సీఎం జగన్‌.

 

 

Read more RELATED
Recommended to you

Latest news