చైనాలో లాంచ్‌ అయిన Xiaomi Book Pro 2022..అదిరిపోయిన రెండు మోడల్స్‌

-

షావోమీ నుంచి తన కొత్త ల్యాప్‌టాప్‌ లాంచ్‌ అయింది. అదే Xiaomi Book Pro 2022.ఇందులో రెండు మోడల్స్‌ చైనా మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చాయి. డాల్బీ విజన్ సపోర్ట్, షావోమీ క్రియేట్ చేసిన LUT కలర్ కరెక్షన్ టెక్నాలజీతో కూడిన E4 OLED టచ్ డిస్‌ప్లే ఈ ల్యాప్‌టాప్‌లకు ప్రధాన ఆకర్షణగా నిలచాయి. ఇంకా ఇందులో స్పెసిఫికేషన్స్‌ ఎలా ఉన్నాయంటే…

Xiaomi Book Pro 2022 Series ధర

షావోమీ బుక్ ప్రో 14 ఇంచుల మోడల్ i5 ప్రాసెసర్‌ వెర్షన్‌ ల్యాప్‌టాప్‌ ప్రారంభ ధర 6799 యువాన్లు అంటే సుమారు రూ.80,000), i7 ప్రారంభ ధర 8499 యువాన్లు అంటే సుమారు రూ.1,00,000గా ఉంది. 16 ఇంచుల మోడల్ i5 వెర్షన్‌ ల్యాప్‌టాప్‌ 7399 యువాన్లు (సుమారు రూ.87,000), i7 వెర్షన్‌ 9399 యువాన్ల (సుమారు రూ.1,10,700) ధరతో లాంచ్ అయ్యాయి.

Xiaomi Book Pro 2022 14-Inch 2022 స్పెసిఫికేషన్లు..

షావోమీ బుక్ ప్రో 14 ఇంచ్ 2022 ల్యాప్‌టాప్‌ E4 OLED టచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
3D LUT కలర్ కరెక్షన్, 90Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటాయి.
డిస్‌ప్లేకు ప్రొటెక్షన్‌గా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉంది.
12వ జనరేషన్ ఇంటెక్ కోర్ పీ సిరీస్ ప్రాసెసర్‌పై ఈ ల్యాప్‌టాప్‌ రన్ అవుతుంది.
ఇంటెల్ కోర్ ఐ5, కోర్ ఐ7 ప్రాసెసర్‌ వెర్షన్‌లతో ఈ మోడల్ అందుబాటులోకి వచ్చింది.
గరిష్ఠంగా 16జీబీ ర్యామ్, 512 SSD స్టోరేజ్ ఉంటుంది.
షావోమీ బుక్ ప్రో 14 ఇంచ్ 2022 ల్యాప్‌టాప్‌ 100వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
చార్జింగ్ కోసం యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ఉంది.
మొత్తంగా ఈ మోడల్ 1.5కేజీల బరువు, 14.9mm మందం ఉంటుంది.

Xiaomi Book Pro 16-Inch 2022 స్పెసిఫికేషన్లు..

14 ఇంచ్ బుక్ ప్రో 2022 మోడల్‌ స్పెసిఫికేషన్లనే చాలా వరకు 16 ఇంచ్ ల్యాప్‌టాప్‌ కలిగి ఉంది.
షావోమీ బుక్ ప్రో 16 ఇంచ్ 2022 ల్యాప్‌టాప్‌ కూడా E4 OLED రెటీనా మాస్టర్ టచ్ డిస్‌ప్లేతో వస్తోంది.
3D LUT కలర్ కరెక్షన్‌తో పాటు డిస్‌ప్లే ఫీచర్లు అవే ఉంటాయి.
రిఫ్రెష్ రేట్ మాత్రం ఈ ల్యాప్‌టాప్‌లో 60Hzగా ఉంటుంది.
12వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5, i7 ప్రాసెసర్‌ వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి.
ఈ మోడల్ కూడా 100వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
భారత్‌లోనూ త్వరలోనే Xiaomi Book Pro 2022 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news