విశాఖపట్నం నుండి అస్సాం, మేఘాలయ.. పూర్తి వివరాలు ఇవే..!

-

మీరు ఏదైనా టూర్ వెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే ఈ టూర్ ప్యాకేజీని చూడండి. అస్సాం, మేఘాలయ వంటి ప్రాంతాలను ఈ టూర్ ప్యాకేజీ ద్వారా చూసి వచ్చేయచ్చు. ఇక ఈ టూర్ ప్యాకేజీ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఐఆర్‌టీసీటీ విశాఖపట్నం నుంచి ఈ టూర్ ని అందిస్తోంది. అస్సాం, మేఘాలయ వంటి ప్రాంతాలు దీనిలో కవర్ అవుతాయి. కనుక ఎవరైనా మేఘాలయ, అస్సాం వెళ్లాలనుకుంటే ఈ ప్యాకేజీ ద్వారా వెళ్లి వచ్చేయచ్చు. మేఘాలయ , అస్సాం టూర్ వారం రోజులు ఉంటుంది. అంటే ఆరు రాత్రులు ఏడు రోజులు. చిరపుంజీ, గువాహటి, కజిరంగ, షిల్లాంగ్, మౌలీనాంగ్ ఇవన్నీ కూడా చూసి వచ్చేయండి.

మ్యాజికల్ అస్సాం మేఘాలయ విత్ కజిరంగ పేరు తో ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ను అందుబాటులో ఉంచింది. చరిత్ర, సంస్కృతి, ప్రకృతి ప్రేమికులకు ఈ ప్యాకేజీ బాగుంటుంది. ఫిబ్రవరి 21న ఈ టూర్ ప్రారంభం అవుతుంది. ఇక ఈ ప్యాకేజీ ధరల విషయానికి వస్తే.. సింగిల్ ఆక్యుపెన్సీ కి రూ. 54,545 చెల్లించాలి. అదే డబుల్ ఆక్యూపెన్సీ అయితే రూ. 39,810 కట్టాలి. ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ. 37,880 పడుతుంది. 5 నుంచి 11 ఏళ్లు పిల్లలకి అయితే రూ. 34,460 చెల్లించాలి. ఇక చైల్డ్ విత్‌ఔట్ బెడ్ కి అయితే మీరు రూ. 14740 కట్టాలి. ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్ సైట్ లో పూర్తి వివరాలని చూసి బుక్ చేసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news