మందుస్తు ఎన్నికలపై సజ్జల కీలక వ్యాఖ్యలు

-

టీడీపీ, జనసేన పొత్తుపై సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంలో లేరని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఐదేళ్ళ కాలానికి తీర్పు ఇచ్చారని, ప్రతిపక్షాలు తాము సజీవంగా ఉన్నామని చెప్పటానికి ముందస్తు ప్రకటనలు చేస్తున్నారన్నారు. రహస్యంగా ఎందుకు సమావేశాలు అవుతున్నారు అని అన్నారు. తమ అక్రమ సంబంధాలను సక్రమం అని చెప్పటానికి ప్రయత్నిస్తున్నారని, చంపిన వాళ్ళను పరామర్శించటం ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా?? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. ’11 మంది ప్రాణాలు తీసిన వ్యక్తిని పవన్ కళ్యాణ్ పరామర్శించటం. చనిపోయిన కుటుంబాలను పవన్ కళ్యాణ్ పరామర్శించ లేదు.

జనసేన, టీడీపీ కలవటాన్ని వామపక్షాలు స్వాగతించటం విచిత్రంగా ఉంది. బీజేపీ కూడా కలిస్తే వామపక్షాలు ఏ వైఖరి తీసుకుంటాయో. ఎరుపు, కాషాయం కలిసి పసుపు అవుతుందేమో. ఎంత మందిని కలిసినా మంచిదే. పంది కొక్కులు, ఎలుకలు, అన్నీ కలిస్తే ఎవరి విలువలు ఏంటో మరోసారి బయటపడుతుంది. అందరినీ కలిసి ఒకేసారి ఓడించే అవకాశం కూడా జగన్ కు వస్తుంది.’ అని సజ్జల అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news