కరోనా గురించి “మనలోకం” మళ్ళీ ఇస్తున్న వార్నింగ్…!

-

కరోనా వైరస్ హైదరాబాద్ వచ్చేసింది, అవును వచ్చేసింది, దాని గురించి భయపడాలా…? అవును భయపడాలి. దాని గురించి ఆందోళన అవసరమా…? ఆందోళన అవసరమే. కాని అది వచ్చేసింది మనను చంపేస్తుంది అనే ప్రచారం ఉంది చూడు…? అది అవసరం లేదు. అది రాదూ మిమ్మల్ని చంపదు. ప్రభుత్వాలను నమ్మకపోయినా సరే వాతావరణ పరిస్థితులను అయినా నమ్మండి చాలు.

అది తుమ్మితే దగ్గితే వస్తుంది. అవును వస్తుంది… కాని మనకు ఉన్న వేడి వాతావరణంలో మాత్రం అది బ్రతికే అవకాశాలు ఎంత మాత్రం ఉండవు. కనీసం దాని మనుగడకు ఏ మాత్రం అవకాశం లేదు. తుమ్ముతున్నప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. అలా అని తుమ్మి వేరే వాళ్ళ మీద పడితే వచ్చేస్తుంది, చచ్చిపోతారు, ఆ వైద్యం. ఈ హోమియోపతి అంటూ ఆ మాటలు ఈ మాటలు నమ్మి డబ్బులు వృధా చేసుకోవద్దు.

అనుమానం ఉందా…? జాగ్రత్తలు తీసుకోండి. జ్వరం వచ్చిన ప్రతీ ఒక్కడు కరోనా బాధితుడు కాదు. దానికి ఉష్ణోగ్రత పది డిగ్రీల లోపు ఉండాలి. కాని మన ఉష్ణోగ్రత 30 కి పైగా ఉంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. చికెన్ తింటే కరోనా వస్తుంది అనే తప్పుడు ప్రచారం అసలు నమ్మవద్దు. చికెన్ తింటే కరోనా అసలు రాదు. ఎందుకంటే చికెన్ వంద డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత లో ఉడుకుతుంది. అందులో ఏ వైరస్ కూడా బతికే అవకాశం ఉండదు.

నిల్వ ఉన్న చికెన్ తినవద్దు, ఫ్రిడ్జ్ లో పెట్టింది తినకండి చాలు. అంతే గాని ఎవడో ఏదో చెప్పాడు అని మీరు భయపడిపోయి అనవసరంగా డబ్బులు వృధా చేసుకోవద్దు. చైనా, ఇటలీ, కోరియా కు వెళ్ళింది అంటే అక్కడ చల్లటి వాతావరణం ఉంటుంది కాబట్టి వెళ్ళింది. మనకు రాదు… తెలుగు రాష్ట్రాలకు ఆ అవకాశమే లేదు. అది వచ్చినా బతకదు. కాబట్టి మీరు తప్పుడు ప్రచారాలకు దూరంగా ఉండండి. వచ్చేది ఎండా కాలం. రోడ్డు మీద కోడిగుడ్డు అట్టు వేసుకునే విధంగా ఉంది. నమ్మితే మన ఖర్మ.

Read more RELATED
Recommended to you

Latest news