పోస్టాఫీసు స్కీమ్..రోజుకు రూ.50 కడితే..రూ.36 లక్షలు మీ సొంతం..

-

ప్రజలు డబ్బులను ఆదా చేసుకొనెందుకు ప్రభుత్వం పోస్టాఫీసు ఎన్నో పథకాలను అమలు చేస్తూ వస్తుంది..అనేక పొదుపు పథకాలను అమలులోకి తెచ్చింది. అవి రిస్క్ లేనివి, మంచి రాబడిని అందిస్తాయి. గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ప్రోగ్రామ్ కింద ఇండియా పోస్ట్ అనేక ప్లాన్లను ప్రారంభించింది. వీటిలో గ్రామ్ సురక్ష యోజనకు చాలా ఆదరణ కనిపిస్తోంది. పోస్టాఫీస్ గ్రామ్ సురక్ష యోజన అనేది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇందులో పాలసీ తీసుకున్న ఐదు సంవత్సరాల తర్వాత ఎండోమెంట్ అస్యూరెన్స్ పాలసీకి మార్చుకునే అదనపు ఫీచర్ ఉంది. దీని కింద పాలసీదారు 55, 58 లేదా 60 సంవత్సరాల వయస్సు వరకు తక్కువ ప్రీమియంలను చెల్లించడం ద్వారా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు..

ఈ పథకం యొక్క ముఖ్యమైన ఫీచర్లు, ప్రయోజనాలు, అర్హతలు..

*. గరిష్ట వయస్సు 19 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.

*.  కనీస హామీ మొత్తం రూ.10,000, గరిష్టంగా రూ.10 లక్షలు పొందవచ్చు.. అలాగే నాలుగేళ్ల తర్వాత రుణ సౌకర్యం..

*. పాలసీదారు మూడేళ్ల తర్వాత సరెండర్ చేసే అవకాశం
*. 5 సంవత్సరాల కంటే ముందు సరెండర్ చేస్తే ఈ పథకం బోనస్కు అర్హత లేదు
*. ప్రీమియం చెల్లింపును నిలిపివేసిన తేదీ లేదా మెచ్యూరిటీ తేదీ నుంచి ఒక సంవత్సరంలోపు ఎండోమెంట్ అస్యూరెన్స్కు కన్వర్ట్ చేసుకోలేరు, ఇన్సూరెన్స్ చేసుకున్న వ్యక్తి 59 సంవత్సరాల వయస్సు వరకు ఎండోమెంట్ అస్యూరెన్స్ పాలసీగా మార్చవచ్చు.
*. ప్రీమియం చెల్లించే వయస్సు 55, 58 లేదా 60 ఏళ్లుగా ఎంచుకోవచ్చు
*. పాలసీని సరెండర్ చేస్తే తగ్గించిన హామీ మొత్తంపై ప్రొపోర్షనేట్ బోనస్ చెల్లిస్తారు

ప్రతి రోజు రూ.50 చెల్లించండి, రూ.35 లక్షల రిటర్న్ పొందండి అనేది పోస్టాఫీస్ గ్రామ్ సురక్ష పథకం నినాదం. గ్రామ్ సురక్ష యోజన కింద, పాలసీదారుడు ప్రతి రోజూ కేవలం రూ.50 మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా రూ.35 లక్షల వరకు రిటర్న్లను పొందవచ్చు. వ్యక్తి ప్రతి నెలా పాలసీ కింద రూ.1,515 పెట్టుబడి పెడితే, అంటే దాదాపు ప్రతిరోజూ రూ.50, ఆ పాలసీ విలువ రూ.10 లక్షలు. అయితే మెచ్యూరిటీ తర్వాత ఆ వ్యక్తి రూ.34.60 లక్షల రాబడి పొందుతారు. ఒక పెట్టుబడిదారుడు 55 సంవత్సరాల కాలానికి రూ.31,60,000, 58 సంవత్సరాలకు రూ. 33,40,000, 60 సంవత్సరాల కాల వ్యవధికి రూ.34.60 లక్షల మెచ్యూరిటీ లాభాన్ని పొందుతారు..

Read more RELATED
Recommended to you

Latest news