మీరు మా ఊరు వస్తే చాలు..అన్నీ ఫ్రీ ఫ్రీ..

-

ఈ రోజుల్లో ఫ్రీగా వస్తే ఫినాయిల్ ను కూడా వదలరు జనాలు..ఎందుకంటే అంత కరువులో ఉన్నారు.ప్రతి ఒక్కరికి మనసులో ఎన్నో కోరికలు ఉంటాయి..వేరే దేశాలకు వెళ్ళి అన్నీ చూడాలని ఉండటం సహజం..పర్యాటక ప్రాంతానికైతే అయ్యే ఖర్చు అంతా ఇంతా కాదు. ప్రయాణ ఖర్చులు, హోటల్ బిల్లులు, భోజనం, సైట్ సీయింగ్ ఇలా ఎన్నో ఖర్చులు..అందుకే చాలా మంది ఎక్కడికైనా వెళ్లాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని, బడ్డెట్ చూసుకుని వెళ్తుంటారు. మన పక్కనున్న పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలన్నా ఎంతో కొంత ఖర్చు అవుతుంది. కాని ఇటలీలోని ఓ ప్రాంతానికి వెళ్తే మాత్రం.. వాళ్లే తిరిగి డబ్బులిస్తారంట.. అంతే కాదు ఇంకెన్నో ఉచితాలంటూ ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. నమ్మడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అయితే వాళ్లకేదో డబ్బులు ఎక్కువై అలా చేయడం లేదండి.. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వారు అలా చేస్తున్నారు. ఏంటి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ ఉచితాల స్కీం ఏమిటనుకుంటున్నారా…

ఆగండి..ఆగండి..దీని గురించి పూర్తీగా తెలుసుకోవాల్సిందే.. ప్రపంచ పర్యాటక ప్రాంతాల్లో ఇటలీ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ దేశంలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. లక్షలాది మంది పర్యాటకులతో ఇటలీలోని అనేక ప్రాంతాలు కిటకిటలాడుతూ ఉంటాయి. అయితే ఇటలీలోని ఓ నగరం మాత్రం ఇప్పటికీ వెలవెలబోతోంది. పర్యాటకులు లేక అక్కడి హోటళ్లు, పార్కులు బోసిపోతున్నాయి. అది పర్యాటక ప్రదేశమైనా.. అక్కడకి పెద్దగా పర్యాటకులు వెళ్లకపోవడంతో పర్యాటకులను ఆకర్షించడానికి వారు పర్యాటకుల కోసం అనేక ఆఫర్లు ప్రకటించారు. ఇంతకీ ఆ నగరం ఏంటనుకుంటున్నారా.. అదే ఫ్రియులి వెనిజియా గియులియా. పర్యాటకులు లేక ఇబ్బందులు పడుతుండటంతో ఈ పరిస్థితులను ఎదుర్క్కొవడం కోసం అక్కడి యంత్రాంగం సిద్ధపడింది.దీని కోసం ఓ పథకాన్ని తీసుకు వచ్చింది. మీరు మా నగరానికి వస్తే చాలు.. డబ్బులిస్తాం అంటూ ప్రచారాలు చేస్తోంది.

ఈ పథకం ద్వారా తమ ప్రాంతానికి వచ్చిన పర్యాటకులకు అనేక ఆఫర్లను ఇస్తోంది. ఫ్రియులి వెనిజియా గియులియా నుంచి వెన్నిస్​ మినహా.. ఇటలీలోని ఏ ప్రాంతానికైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కల్పిస్తున్నారు. రీజనల్​, ఇంటర్​సిటీ లైన్స్​ నుంచి హై స్పీడ్​ లైన్స్​ వరకు..ఏ ట్రైన్​లోనైనా ఉచితంగా ప్రయాణించవచ్చు అని పర్యాటకులకు ఆఫర్లు ఇస్తున్నారు. సందర్శకుల రైళ్ల ఖర్చులు తామే భరిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక తమ నగరానికి వచ్చే సందర్శకులకు ఓ కార్డు ఇస్తామని, దాని ద్వారా ప్రజా రవాణా వ్యవస్థ, మ్యూజియం, పార్కుల్లో ఉచితంగా ఎంట్రీ ఉంటుందని అంటున్నారు..అంతేకాదు ఎక్కడికి వెళ్ళిన కార్డుల పై రాయితీలను కూడా ఇస్తున్నారు..

టూ నైట్​ ప్యాకేజీని బుక్​ చేసుకుంటే.. రిటర్న్​ టికెట్​ డబ్బులను అందులో తగ్గిస్తారు. అయితే ఈ ఆఫర్ 2023 మే 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఫ్రియులి వెనిజియా గియులియా నగర అధికారులు ప్రకటించారు. ఇక్కడ కొన్ని షరతులు కూడా విధించారు. ఫ్రియులి వెనిజియా గియులియా నుంచి వెన్నిస్​ ప్రాంతానికి వెళ్లాలంటే ఎలాంటి ఉచితాలు వర్తించవు..మీకు ఇప్పటి లో ఇటలీకి వెళ్ళే ఆలోచన ఉంటే ఒకసారి అక్కడకు వెళ్ళిరండి..

Read more RELATED
Recommended to you

Latest news