ఏపీలో ఒక్కేరోజు 246 మందికి కరోనా..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి చాలా తీవ్రంగా ఉంది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. మహమ్మారి మాత్రం తగ్గేలా కనిపించట్లేదు. రోజురోజుకి దాని తీవ్రతను పెంచుకుంటూ.. ప్రజల్లో భయాందోళన కలిగిస్తుంది. ఇప్పటికే వేలకొద్ది కేసులు నమోదయ్యాయి. కాగా తాజాగా.. గడచిన 24 గంటల్లో 15,173 నమూనాలు పరీక్షించగా 246 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5 వేలు దాటింది. ఇప్పటివరకు 5087 మందికి కరోనా నిర్ధారణ అయింది. తాజాగా  47 మందిని డిశ్చార్జి చేశారు. దాంతో, ఇప్పటిదాకా 2,770 మంది డిశ్చార్జి కాగా, 2,231 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా మరో రెండు మరణాలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లాలో ఒకరు మృత్యువాత పడగా మరణాల సంఖ్య 86కి పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news