దేశ ప్రజలను కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. కరోనా ధాటికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరణాల సంఖ్య కూడా భారీగానే పెరుగుతుంది. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా.. ప్రజలు జాగ్రత్తలు పటిస్తున్న ఈ మహమ్మరిని మాత్రం కట్టడి చేయలేక పోతున్నారు. గడచిన 24 గంటల్లో 10,667 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 10,215 మంది రికవరీ కాగా, 380 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,53,178 యాక్టివ్ కేసులుండగా, 1,80,013 మంది రికవరీ అయ్యారని, 9,900 మంది మరణించారని అధికారులు గణాంకాలు విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకూ దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,43,091కి చేరుకున్నట్లయింది.
ఇండియాలో 10 వేలకు చేరువలో కరోనా మరణాలు..!
-
Previous article
Next article