BREAKING : ఉత్తమ్ కుమార్ మోకాలికి తీవ్ర గాయం..!

-

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆస్పత్రి పాలయ్యారు. ఆయన మోకాలికి గాయమైంది. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. ఈ మేరకు ‘మోకాలికి తీవ్ర గాయమైన పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఓ ఫోటోను షేర్ చేసింది. ఆ చిత్రంలో ఉత్తమ్ మోకాలి పట్టీని ధరించారు. ఆయనకు ఈ గాయం ఎలా అయ్యిందనే దాని గురించి సమాచారం లేదు.

కాగా, దీనిపై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డాక్టర్ జే గీతా రెడ్డి స్పందిస్తూ.. తమ అధ్యక్షుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ‘‘యుద్ధ విమానాలు నడిపే మాజీ పైలట్ మాత్రమే కాదు.. పుట్టుకతోనే పోరాటయోధుడు. ఉత్తమ్ గారు త్వరగా కోలుకోవాలని మేం కోరుకుంటున్నాం.’’ అని గీతారెడ్డి ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news