తాగుబోతు సీఎం మాటలు నిజం చేయొద్దు : రేవంత్ రెడ్డి

-

తాగుబోతు సీఎం మాటలు నిజం చేయొద్దని.. తెలంగాణ తల్లి సీఎం ఫామ్ హౌజ్ లో బందీ అయ్యిందని… పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎంత మంది నాయకులు పోయిన కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని… గల్లీలో కార్యకర్తలు కష్టపడితేనే ఢిల్లీలో సోనియమ్మ రాజ్యం వస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని బీజేపీ, టీఆర్ఎస్ కలిసి దోచుకుంటున్నాయని.. బీజేపీ, టి.ఆర్.ఎస్ రెండు పార్టీలు తోడు దొంగలేనని కుండ బద్దలు కొట్టారు.

రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం.. వరి వేస్తే ఉరే అని సీఎం సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని వెల్లడించారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని.. కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవడానికే ఈ రెండు రోజుల సదస్సు అని తెలిపారు. క్రమశిక్షణ కాంగ్రెస్ లో ముఖ్యం.. క్రమశిక్షణ తప్పి తాగుబోతు సీఎం మాటలు నిజం చేయొద్దన్నారు.

మేము పదవులు అనుభవిస్తున్నాం అంటే కార్యకర్తల వల్లేనని… కష్టపడే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా.. సోనియమ్మ రాజ్యం కోసం కష్టపడే వారికి పదవులు, టికెట్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇచ్చారు రేవంత్‌ రెడ్డి. కల్వకుంట్ల కుటుంబం నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు. పదవులు అనుభవించి పార్టీ మారిన వాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానమని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news