సంక్రాంతి రోజునే.. జగన్ కు చంద్రబాబు శాపనార్థాలు !

-

వినుకొండ రైతు నరేంద్రను వెంటనే జైలు నుంచి విడుదల చెయ్యాలని జగన్ సర్కార్ ను డిమాండ్ చేశారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. గుంటూరు జిల్లా, వినుకొండ నియోజకవర్గం, శావల్యాపురం రైతు నరేంద్ర ను వెంటనే జైలు నుంచి విడుదల చెయ్యాలని… చేయని తప్పుకు సంక్రాంతి పండుగ రోజు రైతు నరేంద్ర జైలులో ఉండడానికి కారణమైన వైసీపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని చంద్రబాబు ఫైర్ అయ్యారు.

chandrababu naidu ys jagan

పండుగ పూట ఆ అన్నదాత కుటుంబం క్షోభకు కారణమైన ప్రభుత్వాన్ని రైతులోకం క్షమించదని మండిపడ్డారు. మద్దతు ధర అడిగిన పాపానికి రైతును జైల్లో పెట్టి జగన్ ప్రభుత్వం రైతు వర్గాన్నే అవమానించిందని నిప్పులు చెరిగారు. వినుకొండ ఎమ్మెల్యే ఆదేశాలతోనే అక్రమ కేసు పెట్టినట్లు ఇప్పటికే నిర్ధారణ అయ్యిందన్నారు. తప్పుడు కేసు పెట్టిన వినుకొండ రూరల్ సీఐ అశోక్ కుమార్ సస్పెండ్ అయ్యారని.. ప్రభుత్వం తన తప్పు తెలుసుకుని వెంటనే రైతు నరేంద్ర ను విడుదల చెయ్యాలి… వేధింపులకు గురిచేసినందుకు నరేంద్ర కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news