మళ్లీ ఎన్డీయేకే అధికారం… ఇండియా టూడే సర్వేలో వెల్లడి

-

మరోసారి ఎన్నికల్లో బీజేపీ కూటమి ఎన్డీయేకే అధికారం వస్తుందని ఇండియా టుడే సర్వేలో వెల్లడి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఎన్డీయేనే మళ్లీ అవకాశం వస్తుందని మూడ్ ఆఫ్ దినేషన్ సర్వేలో వెల్లడించింది. 543 స్థానాలున్న లోక్ సభలో ఎన్డీయేకు 296, యూపీఏకు 127, ఇతరులకు 120 స్థానాలు దక్కుతాయని అంచానా వేసింది. ఇందులో ఒక్క బీజేపీకే 271 స్థానాలు దక్కితే… కాంగ్రెస్ పార్టీకి 62, మిగతా పార్టీలకు 210 స్థానాలు దక్కే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వేలో వెల్లడైంది.

ప్రస్తుతం వచ్చే నెల దేశంలో జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలకు సెమిఫైనల్ గా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఇటీవల ఓ సర్వేలో ఉత్తర్ ప్రదేశ్ లో మళ్లీ బీజేపే అధికారంలోకి వస్తుందని అంచానా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news