బీజేపీ అధికార ప్రతినిధులపై బండి సంజయ్‌ అసంతృప్తి..

-

బీజేపీ తెలంగాణ చీఫ్‌ బండి సంజ‌య్ పార్టీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధుల‌పై ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. పార్టీలో ఇక్కడ 9 మంది అధికార ప్ర‌తినిధులున్నా… పార్టీకి ఆశించిన మేర ప‌ని చేయ‌డం లేద‌ని ఆయ‌న మండిపడ్డారు. అధికార ప్ర‌తినిధులుగా చేయాల్సిన ప‌నుల‌ను వారు చేయ‌డం లేద‌ని కూడా ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న అంశాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్‌గా ఉండాల‌ని ఆయన సూచించారు.

Telangana BJP Cheif Bandi Sanjay Wants 'Seditious Case' Filed Against CM K. Chandrashekar Rao

రాష్ట్రంలోని పరిస్థితులపై ఆ మేర‌కు అధికార ప్ర‌తినిధుల నుంచి స్పంద‌న లేద‌ని ఆయ‌న అన్నారు. ఇక‌పై అలా కుద‌ర‌ద‌ని చెప్పిన బండి సంజ‌య్‌.. ఇక‌పై ప్ర‌తి రోజు అధికార ప్ర‌తినిధుల్లో ఒక‌రు పార్టీ కార్యాల‌యంలో ఉండాల్సిందేన‌ని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో జ‌రిగే ఘ‌ట‌న‌ల‌పై నేత‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తూ పార్టీ లైన‌ప్‌ను వారికి వివ‌రించాల‌ని ఆయ‌న అధికార ప్ర‌తినిధుల‌కు దిశానిర్దేశం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news