యువతిపై అత్యాచార యత్నం… భర్తతో సంబంధం ఉందని భార్య చేసిన పాడుపని

-

హైదరాబాద్ కొండాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. సాటి మహిళ అని చూడకుండా ఓ మహిళ కర్కషంగా ప్రవర్తించింది. సభ్యసమాజం తలదించుకునేలా… మహిళలకు మచ్చ తెచ్చేలా పాడుపనికి పాల్పడింది ఓ యువతి. సదరు యువతితో మహిళ భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో నలుగురు యువకులతో అత్యాచారయత్నం చేయించడానికి ప్రయత్నించింది. పూర్తి వివరాల్లోకి వెళితే కొండాపూర్ కు చెందిన గాయత్రికి శ్రీకాంత్ తో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే శ్రీకాంత్ కు మరో యువతితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించింది. అయితే ఈ నెల 26న మాట్లాడుకుందాం రమ్మని యువతిని, గాయత్రి ఇంటికి రమ్మని చెప్పింది. వచ్చిన తర్వాత సదరు యువతి నోటికి ప్లాస్టర్ చుట్టి బట్టలు విప్పించి నగ్నంగా ఓ గదిలో బంధించింది. నలుగురు వ్యక్తులతో యువతిపై అత్యాచారానికి పాల్పడాలని చెబుతూ గదిలోకి పంపించింది. ఈ క్రమంలో నలుగురు యువకులు యువతిపై లైంగికదాడి చేశారు. ఫోటోలు, వీడియోలు తీశారు. ఇదిలా ఉంటే ఈ విషయం ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని గాయత్రి బెదిరించింది. అయితే రెండు రోజులు విషయాన్ని ఎవరికి చెప్పని యువతి తరువాత ధైర్యం తెచ్చుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం గాయత్రిని, నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news