తెలంగాణ సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ.. రైతుబంధు విడుదల చేయండి

-

యాసంగి వడ్లు కొనుగోలు డబ్బు రైతాంగానికి వెంటనే చెల్లించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ లేఖ రాసారు. రైతుబంధు పథకం నిధులను వెంటనే రైతులఖాతాల్లో జమచేయాలని డిమాండ్ చేశారు. యాసంగిలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాల్లోనే రైతులనుండి కొనుగోలు చేసిన వడ్లకు రూ.517.16 కోట్ల రూపాయలు రాష్ట్రప్రభుత్వం ఇంకా చెల్లించాల్సి ఉందన్నారు బండి సంజయ్‌.

రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే ఫామ్‌హౌజ్‌ నుంచి బయటకి వచ్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షించాలన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు వంటి విషయాలలో వ్యవసాయశాఖ మొద్దునిద్ర వీడే విధంగా చర్యలు చేపట్టాలని నిప్పులు చెరిగారు బండి సంజయ్‌. రైతు సంఘాలతో, అన్నీ రాజకీయపార్టీలతో రైతాంగ సమస్యలపై జిల్లా కలెక్టర్లు సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు బండి సంజయ్‌. రైతులకు అవసరమైన పెట్టుబడి సాయం వెంటనే అందించాలన్నారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news