దేశం మీద ఒట్టేసి చెప్తున్నా..ఏపీ ప్రజల స్థితి గతులు మారుస్తా – పవన్‌ కళ్యాణ్‌

-

దేశం మీద ఒట్టేసి చెప్తున్నా జనసేన అధికారం లో కి వస్తె ప్రజల స్థితి గతులు మారుస్తానని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్స వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్న్నెల్లు కర్ర సాము నేర్చుకుని మూలకున్న ముసలమ్మను కొట్టినట్లు సీఎం జగన్‌ పరిస్తితి ఉందని ఫైర్‌ అయ్యారు.

151 సీట్ల మెజారిటీ తో ప్రభుత్వాన్ని ఇస్తే ప్రజల మీద దాడి చేయడానికి ఆ అధికారం వాడుతున్నాడు…మోది దగ్గరకి సీఎం జగన్ వెళ్తే ఏం చేస్తాడు నాకు తెలుసన్నారు పవన్ కళ్యాణ్. బరి తెగించిన వైసీపీ ఎమ్మెల్యేలకు చెప్తున్న మీరు ఎక్కువ చేస్తే లెక్కలు తేల్చుకోవడానికి మేం సిద్ధం గా నే ఉంటామని వార్నింగ్‌ ఇచ్చారు.

మేము గాంధీ జి స్ఫూర్తి తో ఉన్నాం కానీ ఆయన వారసులం కాదు …నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారసులం…మీరు ఒకటి కొడితే మేం నాలుగు కొట్టగలమని హెచ్చరించారు. నాకోసం నేను ఏది అడగను…మీ కోసం అడుగుతున్న రాబోయే ఎన్నికలలో జనసేన కి అధికారం ఇవ్వండన్నారు. నవ రత్నాల లడ్డూలు నేను ఇవ్వలేను గాని ప్రజలను, వ్యవస్థ ను అభివృద్ధి చేసి తీరుతామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news