BREAKING : బండి సంజయ్ 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర పునః ప్రారంభం

-

తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం అయింది. ఇవాళ స్టేషన్ ఘనపురం నియోజకవర్గం, ఉప్పుగల్ సమీపంలోని పాదయాత్ర శిబిరం నుంచి తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం అయింది. ఉప్పుగల్, కూనూరు, గర్మేపల్లి మీదుగా నాగాపురం వరకు బండి సంజయ్ పాదయాత్ర ఇవాళ కొనసాగనుంది.

ఇక ఇవాళ నాగాపురం సమీపంలో బండి సంజయ్ రాత్రి బస చేయనున్నారు. జనగామలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ చేసిన కామెంట్లకు వ్యతిరేకంగా.. పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేసారు. అలాగే పాదయాత్ర చేయకూడదని బండి సంజయ్‌ కి నోటీసులు ఇచ్చారు. అయితే.. బండి సంజయ్‌ పాదయాత్ర చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతలు ఇచ్చింది. ఈ నేపథ్యంంలోనే.. బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ఇవాళ పునః ప్రారంభం అయింది.

Read more RELATED
Recommended to you

Latest news