బుల్లితెరపై మహేశ్​ సితార డ్యాన్స్​… ఫ్యాన్స్​ ఫుల్​ ఖుషీ

-

సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేశ్​ బాబు.. కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో సూపర్​హిట్​ అందుకున్న ఆయన రీల్​ లైఫ్​లోనే కాకుండా రీయల్ లైఫ్​లోనూ హీరో అనిపించుకున్నారు. ఆయన కూతురు సితార ఘట్టమనేని కూడా సోషల్​మీడియాలో ఫుల్​ యాక్టివ్​గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తుంటుంది. అయితే మహేశ్​ బాబు, సితార కలిసి సోషల్​మీడియాలో తప్ప ఒకే స్టేజిపై కనిపించడం చాలా అరుదు. అయితే తాజాగా వీరిద్దరు కలిసి ఓ షోలో కనిపించనున్నారు.

సితారతో మహేశ్
సితారతో మహేశ్

ఇప్పటికే బుల్లితెర పై ప్రసారమయ్యే పలు షోలలో మహేశ్​ బాబు పాల్గొన్నారు. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్​గా వ్యవహరించిన.. ‘మీలో ఎవరు కోటేశ్వరుడు’ షోలో పాల్గొన్నారు. ఇటీవల బాలయ్య హోస్ట్​గా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమంలో పాల్గొన్ని సందండి చేశారు. ఇప్పుడు మరోసారి తాజాగా మరో గెస్ట్​గా రాబోతున్నారు. అయితే ఈ సారి మాత్రం సింగిల్​గా కాకుండా తనతో పాటు తన కుమార్తె సితారను కూడా తీసుకొచ్చారు. ఓ ఛానల్​లో ప్రసారం అవుతున్న డ్యాన్స్​ ఇండియా డ్యాన్స్​ షోకు ముఖ్య అతిథులుగా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదైలంది. ఇది చూసిన మహేశ్​ అభిమానులు ఎంతో ఖుషీ అవుతున్నారు.

సితారతో మహేశ్
సితారతో మహేశ్

కాగా, సితారకు డ్యాన్స్ అంటే ఇష్టం అన్న సంగతి తెలిసిందే. గతంలో ఈ చిన్నారి కూచిపూడి డ్యాన్స్ చేసి అందరిని ఆకట్టుకుంది. ఓ సందర్భంలోనూ మహేశ్​ కూడా సితారకు డ్యాన్స్ అంటే ఇష్టమని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news