నా రాజీనామా వల్లనే కేసీఆర్ గట్టుప్పల్‌ను మండలంగా ప్రకటించారు : కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

-

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం రోజు రోజుకు వేడెక్కుతోంది. అయితే.. ఆదివారం మునుగోడులోని మసీద్ గూడెంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తన రాజీనామా వల్లనే కేసీఆర్ మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్ ను మండలంగా ప్రకటించారని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ పై రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ పెద్ద అబద్ధాలకోరు అని ఆరోపించారు రాజగోపాల్ రెడ్డి. అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెబుతారని, ఎవరినైనా మోసం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. రాష్ట్రానికి రెండు సార్లు సీఎం అయిన కేసీఆర్… అబద్ధపు హామీలతో ప్రజలను వంచించారని మండిపడ్డారు రాజగోపాల్ రెడ్డి.

Komatireddy Raj Gopal Reddy: Ready to make any sacrifice for development:  Rajagopal ReddyNews WAALI | News Waali

దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇండ్లు, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పెద్ద ఎత్తున ఉద్యోగాలు అని చెప్పి ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ కు డబ్బు మీద వ్యామోహం తప్ప ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేదని విమర్శించారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు ప్రజలు గుర్తుకు వస్తారని, లేకుంటే ఆయన ఫాం హౌజ్ కే పరిమితమవుతారని ఫైర్ అయ్యారు. తనను ప్రశ్నించకుండా రాష్ట్రంలో ప్రతిపక్షాలను లేకుండా చేయాలని కోట్లు పెట్టి నాయకులను కొంటున్నారని కేసీఆర్ పై విరుచుకుపడ్డారు రాజగోపాల్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news