మద్యం, గంజాయి మత్తులో హల్‌చల్‌.. పోలీసుల అదుపులో మైనర్లు

-

రోజు రోజుకు యువత మత్తుకు బానిసలవుతున్నారు. ఇప్పటికే మత్తులో ఎన్నో ఘోరాలు చేసిన ఘటనలు వెలుగు చూశాయి. అయితే.. తాజాగా మద్యం, గంజాయి మత్తులో హల్‌చల్‌ చేస్తూ కాలనీవాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్న నలుగురు మైనర్లను కుషాయిగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చర్లపల్లి డివిజన్‌ సోనియాగాంధీ నగర్‌లో గురువారం రాత్రి నలుగురు యువకులు మద్యం సేవించి బీరు బాటిళ్లు పగులగొడుతూ వీరంగం సృష్టించారు మైనర్లు. పరస్పరం గాయపరచుకోవడంతో వారికి గాయాలయ్యాయి. స్థానికులు డయల్‌-100 ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి యువకులను మందలించి వెళ్లిపోయారు.

Ganja peddler held near school - Telegraph India

శుక్రవారం ఉదయం స్థానికులు మళ్లీ కుషాయిగూడ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పెట్రోలింగ్‌ పోలీసులు వచ్చి నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. తమఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఓ యువకుడు స్నేహితులను పిలిపించుకొని రెండు రోజులుగా మద్యం సేవిస్తున్నట్లు వారి విచారణలో తేలింది. అయితే, యువకులు నలుగురూ మైనర్లు కావడంతో వారికి కౌన్సెలింగ్‌ ఇస్తామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేస్తామని ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news