శబరిమలలో బస్సు బోల్తా… సీఎం జగన్ కీలక ఆదేశాలు

-

 

 

శబరిమల యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో యాత్రికుల బస్సు పతనంమిట్ట వద్ద ప్రమాదానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సీఎంఓ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. వారికి సరైన సహాయం అందించేలా చూడాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించడమే కాకుండా, యాత్రికులకు తగిన సౌకర్యాలు కల్పించేలా చూడాలన్నారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఏపీకి చెందిన భక్తుల బృందం మొత్తం 3 బస్సుల్లో శబరిమల వెళ్లారని, ఈమూడు బస్సులు తిరిగి వస్తున్న సమయంలో ఈ ఉదయం 8:10 గంటలకు పతనంమిట్ట వద్ద ఒక బస్సు ప్రమాదానికి గురైందని తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సులో 44 మంది ప్రయాణిస్తున్నారని, 18 మంది గాయపడ్డారని, ఇందులో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని వివరించారు. మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో వీరికి చికిత్స అందిస్తున్నామని, మిగిలిన యాత్రికులకు వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. పతనంమిట్ట జిల్లా అధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news