కెసిఆర్ 100 తలల రావణాసురుడు – విజయశాంతి

-

బిజెపి ఎంపీ ధర్మపురి ఇంటిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఎంపీ అరవింద్ ఇంటిని సందర్శించి వారి అమ్మగారిని పరామర్శించారు బిజెపి నేత విజయశాంతి. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కెసిఆర్ వంద తలల రావణాసురుడు అని వ్యాఖ్యానించారు. హత్యలు, మానభంగాలు, దోపిడి లు కెసిఆర్ పాలన లో జరుగుతున్నవి ఇవేనని దుయ్యబట్టారు.

విమర్శలకు సమాధానం చెప్పాలి కానీ… కొట్టి చంపుతామని అనడం ఏంటి? అని ప్రశ్నించారు. వీధి రౌడీలకు, నీ బిడ్డ మాట్లాడిన దానికి తేడా లేదన్నారు విజయశాంతి. మీ బిడ్డ గురుంచి మొదట మాట్లాడింది మీరేనని చురకలంటించారు. అరవింద్ మాట్లాడిన దాంట్లో తప్పులేదన్నారు విజయశాంతి. కెసిఆర్, అయన కుటుంబం ఒళ్ళు ,నోరు దగ్గర పెట్టుకునీ మాట్లాడాలని హెచ్చరించారు. మీ బిడ్డ వాడిన పదాలనే తెలంగాణ ప్రజలు మీ మీద ఉపయోగిస్తారని అన్నారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news