చంద్రబాబు కళ్ళకు అంతా పచ్చగానే కనిపిస్తోంది – బొత్స

-

చంద్రబాబు కళ్ళకు అంతా పచ్చగానే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. విజయనగరంలో చంద్రబాబు సొల్లు కబుర్లు మాత్రమే చెప్పారని మండిపడ్డారు. చంద్రబాబు సైకోలు అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. రోజురోజుకీ ఆయన దిగజారి పోతున్నారని అన్నారు. రాష్ట్రంలో టిడిపికి నూకలు చెల్లిపోయాయి అన్నారు బొత్స సత్యనారాయణ.

అమరావతిలో చంద్రబాబు 30 వేల ఎకరాలు దోచుకున్నారని ఆరోపించారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో చేసింది మీ లెక్క ఇప్పుడు వ్యక్తిగత దూషణలనే నమ్ముకున్నారని మండిపడ్డారు. కనీసం విజయనగరం జిల్లాకు ఏం చేశారో చెప్పాలి కదా అని ప్రశ్నించారు. 14 ఏళ్ల ఆయన పాలనలో చేసిన ఒక మంచి పని అయినా చూపించాలని సవాల్ విసిరారు సత్యనారాయణ. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news