కనీసం నా కూతుర్లనైనా వదిలేయండి.. నెటిజన్లపై కుష్బూ ఫైర్..

-

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన నటి కుష్బూ.. కొన్నాళ్లపాటు హీరోయిన్ గా దాదాపు అందరూ స్టార్ హీరోల పక్కన నటించింది ఈ భామ. ఆ తర్వాత మాత్రం దర్శకుడు సుందర్ ను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. అయితే కుష్బూ కు ఇద్దరు కూతుర్లు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్నిసార్లు ఆమె కూతుర్లపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ముఖ్యంగా బాడీ షేవింగ్ పై విపరీతంగా కామెంట్లు పెట్టారు. మరొకసారి ఇలాంటి కామెంట్లు ఎదురవగా తనదైన శైలిలో ఫైర్ అయ్యారు..

నటి కుష్బూ తాజాగా నెటిజెన్లపై ఫైర్ అయ్యారు. ఇప్పటికే పలుమార్లు తన కూతుర్లపై నెటిజన్లు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాడీ షేవింగ్ విషయంలో వీళ్లు ఎన్నో కామెంట్లు ఎదుర్కొన్నారు. అయితే తాజాగా కుష్బూ ట్విట్టర్లో తన ఇద్దరు కుమార్తెలతో ఉన్న ఫోటోని డీపీగా పెట్టుకున్నారు. ఈ ఫొటోస్ పై నెగిటివ్ కామెంట్స్ ఎదురయ్యాయి దీన్ని సహించలేని కుష్బూ తనదైన రీతిలో జవాబు ఇచ్చారు..

కుష్బూ ట్విట్టర్ డిపి ని చూసిన ఓ నెటిజన్.. వీళ్ళిద్దరూ ముక్కుకి సర్జరీ చేయించుకున్నారు అంటూ అనుమానం వ్యక్తం చేశాడు. దీనితో ఖుష్బూ మండిపడింది. 20, 22 ఏళ్ల వయసున్న నా పిల్లలకు కత్తులతో సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లలపై ట్రోలింగ్ చేయడం సిగ్గుమాలిన చర్య. కనీసం పిల్లలని అయినా విడిచిపెట్టండి అంటూ ఘాటుగా స్పందించారు. ఖుష్బూ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news