ఒకరిద్దరు చేరినంత మాత్రాన కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు – బండి సంజయ్

-

కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. నేడు వరంగల్ జిల్లాలో బిజెపి సన్నాహక సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ మాట్లాడుతూ.. ఒకరిద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన అధికారంలోకి రాలేరని అన్నారు. సింగిల్ గా పోటీ చేసే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లేదని.. బిజెపి ని ఓడించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపాయని ఆరోపించారు.

రాష్ట్రంలో రామరాజ్యం స్థాపించడమే తమ లక్ష్యమని చెప్పారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్, మునుగోడు, దుబ్బాకలో డిపాజిట్ కూడా రాలేదని విమర్శించారు. బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బిజెపియేనని అన్నారు. ఈనెల 8న వరంగల్ లో జరిగే మోడీ సభను విజయవంతం చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news