కల్వకుంట్ల కుటుంబాన్ని అండమాన్‌కు తరమాలి : రేవంత్‌ రెడ్డి

-

ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబాన్ని అండమాన్ కు జైలుకు పంపుతామని అన్నారు. తెలంగాణ కోసం బలిదానాలు చూడలేక సోనియా గాంధీ చలించిపోయిన తెలంగాణ ఇచ్చారన్నారు రేవంత్ రెడ్డి. 60 ఏళ్ల పోరాటాన్ని గుర్తించి సోనియా తెలంగాణ ఇచ్చిందని, 1200 మంది ఆత్మబలిదానాలకు సోనియా చలించిపోయారన్నారు.

 

Telangana Congress chief's comments on Reddy leadership create rumblings in party | Latest News India - Hindustan Timesబలిదానాలు చూడలేకే సోనియా తెలంగాణ ఇచ్చారని, కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను కొల్లగొట్టిందని ఆయన మండిపడ్డారు. ఖమ్మం సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారని, బస్సులు ఇవ్వలేదు, లారీలను అడ్డుకున్నారని రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్‌ నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని, కల్వకుంట్ల కుటుంబాన్ని అండమాన్‌కు తరమాలని ఆయన అన్నారు. రాహుల్ సమక్షంలో వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌ ప్రకటించామని, ప్రియాంక సమక్షంలో యూత్‌ డిక్లరేషన్‌ ప్రకటించామని రేవంత్‌ రెడ్డి అన్నారు. డిసెంబర్‌ 9న కాంగ్రెస్‌ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు రేవంత్‌. ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తామని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news