దళిత అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 25 వేలు, ఇతరులకు 50 వేలు – రేవంత్‌

-

కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ కావాలంటే దళిత అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 25 వేలు, ఇతరులు 50 వేలు చెల్లించాల్సిందేనని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దరఖాస్తు ఫార్మ్ ను ఆవిష్కరించారు పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 25 వేలు… ఇతరులకు 50 వేల ఫీజు నిర్ధారించినట్లు స్పష్టం చేశారు.

ఆ డబ్బులను తిరిగి ఇవ్వడం ఉండదు… పార్టీ అకౌంట్ లోకి వెళ్తాయని వెల్లడించారు రేవంత్‌ రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు నుండి 25 వ తేదీ వరకు తీసుకుంటామని వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ తరువాత దరఖాస్తు దారుల పై సర్వే చేయడం జరుగుతుంది…. సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని స్క్రీనింగ్ కమిటీ కి జాబితా ఇస్తామని చెప్పారు రేవంత్‌ రెడ్డి. స్క్రీనింగ్ కమిటీ పేర్లను ఫైనల్ చేసి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కు పంపిస్తాం…సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థులను ప్రకటిస్తుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news