చైనాలో 2.ఓ భారీ రిలీజ్..!

-

సూపర్ స్టార్ రజినికాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 2.ఓ నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. 600 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 4 రోజుల్లో 400 కోట్లు వసూళు చేసింది. అయితే ఈ సినిమా రేంజ్ ఇంకాస్త పెంచేలా చైనాలో 2.ఓని భారీగా రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 10000 ల సెంటర్స్ లో 50000ల స్క్రీన్స్ లో 2.ఓ రిలీజ్ అవుతుంది.

భారీ కలక్షన్స్ సాధించే క్రమంలో చైనాలో డబ్ చేసి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. విజువల్ వండర్ గా వచ్చిన ఈ మూవీ ఇండియన్ సిని ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది. రజినితో పాటుగా అక్షయ్ కుమార్ కూడా నటించిన ఈ మూవీలో ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. ఏ.ఆర్.రెహమాన్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది.

తెలుగులో మాత్రం ఈ సినిమాకు నష్టాలు వచ్చేలా ఉన్నాయి. 70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా 5 రోజుల్లో 35 కోట్లు మాత్రమే రాబట్టింది. మరి ఫుల్ రన్ లో ఎంత తెస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news