‘పుష్ప-2’లో ‘దాక్షాయణి’గా అనసూయ పాత్ర అంతకు మించి..!!

-

బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేకస్థానం సంపాదించుకున్న యాంకర్ అనసూయ భరద్వాజ్..వెండితెరపైన కూడా ఫుల్ బిజీ అయిపోయింది. ప్రజెంట్ అటు సిల్వర్ స్క్రీన్ పైన ఇటు టీవీల్లో రెండింటా సందడి చేస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ‘రంగస్థలం’ చిత్రంలో ‘రంగమ్మత్త’గా అలరించిన ఈ నటికి…వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే ..మరి కొన్ని పిక్చర్స్ లో లీడ్ రోల్ కూడా ప్లే చేస్తోంది. ఈ సంగతులు పక్కనబెడితే..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ పిక్చర్ లో అనసూయ ‘దాక్షాయణి’గా డిఫరెంట్ గెటప్ లో అదరగొట్టింది. అయితే, ఇందులో పాత్ర నిడివి కొంచెం తక్కువగా ఉన్నట్లు టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే పుష్ప పార్ట్-2లో అనసూయ పాత్ర నిడివిని పెంచినట్లు టాక్. డైరెక్టర్ సుకుమార్ అనసూయ పాత్రను చాలా చక్కగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

‘పుష్ప-2’ షూటింగ్ కోసం అనసూయ రెమ్యునరేషన్ కూడా బాగా పెంచేసినట్లు సమాచారం. ఒక రోజుకు రూ.2 లక్షలు తీసుకోబోతున్నదని టాక్. సుకుమార్ ఇప్పటికే ‘పుష్ప-2’ స్టోరిని ఫైనల్ చేశారని, త్వరలో ఫుల్ ఫ్లెడ్జ్ గా షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం అందుతోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి అందరికీ విదితమే.

Read more RELATED
Recommended to you

Latest news