బ్యూటీ స్పీక్స్ : ఇస్మార్ట్ పోరీకి రాయున‌ది…

-

అందం అభినయం అన్న‌వి ముఖ్యంగా భావించే న‌టీన‌టుల‌కు మాత్ర‌మే చిత్ర‌సీమ‌లో గుర్తింపు. అందంతో పాటు కొంత యాటిట్యూడ్ ఉన్న అమ్మాయిలు ఇండ‌స్ట్రీలో త‌మ‌దైన గుర్తింపుతో దూసుకుపోతారు. అందాల న‌భా కూడా ఇదే కోవ. ఆమె న‌టించిన సినిమాల్లో ముఖ్యంగా యాటిడ్యూడ్ ను షో చేసేవే.. ఇక 2019లో ఆమె చేసిన ఇస్మార్ట్ శంక‌ర్ తో ఆమె పేరు ఎక్క‌డంటే అక్క‌డ మార్మోగిపోయింది. మాసివ్ లుక్ ఉన్న హీరోయిన్ గా ఆమె పేరు తెచ్చుకున్నారు. పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్లో వ‌చ్చిన ఆ సినిమా ఆమె జాత‌కాన్నే మార్చేసింది.

గ‌ణ‌తంత్ర వేడుక‌ల వేళ ద‌వ‌ళ వ‌స్త్రాల‌లో మెరిసిపోతోంది న‌భా.ఆమె న‌వ్వులు చిందిస్తూ తన అభిమానుల‌కు శుభాకాంక్ష‌లు చెబుతోంది.ముఖ్యంగా ఆ న‌వ్వులోనే గొప్ప న‌మ్మ‌కం విశ్వాసం రెండూ దాగి ఉన్నాయ‌ని చాటుతోంది. గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన మువ్వెన్న‌ల జెండాను ప‌ట్టుకుని త‌న‌దైన ఆత్మ‌విశ్వాసంతో రెట్టించిన న‌మ్మ‌కంతో రేప‌టి వేళ నాదే.. అన్నంత ధీమాతో ఆమె ఫొటోలలో క‌నిపిస్తున్నారు. ఇటీవ‌ల ఆమె న‌టించిన మ్యాస్ట్రో విడుద‌ల‌యింది. కానీ ఆశించిన విధంగా విజ‌య‌వంతం కాలేదు. అయిన‌ప్ప‌టికీ త‌న ఆత్మ విశ్వాసం కోల్పోక కొత్త కొత్త అవ‌కాశాల వెతుకులాట‌లో ఉంది.

సాయి ధ‌ర‌మ్ తేజ్ తో చేసిన సోలో బ‌తుకే సో బెట‌రు సినిమాకు సైమా అవార్డు ఆమెను వ‌రించింది. న‌న్ను దోచుకుందువ‌టే సినిమాకు కూడా 2019లో ఆమె సైమా అవార్డును అందుకుంది.ఈ రెండూ బెస్ట్ డెబ్యూ యాక్ట‌ర్ కేట‌గిరిలో అందుకున్న అవార్డులే కావ‌డం విశేషం.2016లో ఫిల్మ్ ఫేర్ అవార్డును ఆమె అందుకున్నారు.వ‌జ్ర‌కాయ అనే క‌న్న‌డ సినిమాకు గాను ఆమెకు ఈ అవార్డు వ‌రించింది.ఉత్త‌మ న‌టి విభాగంలో ఆమె ఈ అవార్డును అందుకుని త‌న ఆనందాల‌ను పంచుకున్నారు ఆ వేళ అభిమానుల‌తో!

Read more RELATED
Recommended to you

Latest news