మనుషుల టీమ్ కు షాకిచ్చిన దివి.. కూరలో కరివేపాకులా ఆ కంటెస్టెంట్!

-

ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో రేటింగ్స్ పెంచుకోవడానికి బిగ్ బాస్ నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కాదు. ప్రోమోల ద్వారా షోలో ఏదో జరుగుతుందనేలా చేసి ఆసక్తి పెంచడానికి బిగ్ బాస్ టీం ప్రయత్నిస్తోంది. ఉక్కు మనుషులు టాస్క్ లో భాగంగా అభిజిత్ తన తెలివితేటలతో కిడ్నాప్ ప్లాన్ చెప్పాడు. అయితే ఆ ప్లాన్ వర్కౌట్ కావడంతో నిన్నటి ఎపిసోడ్ రక్తికట్టింది. అభిజిత్ రోబోలను మనుషుల టీమ్ లో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేద్దామని చెప్పాడు.

అరియానా, లాస్య అందుకు మొదట అంగీకరించకపోయినా మరో ఆప్షన్ లేకపోవడంతో ఒప్పుకున్నారు. ఎలా కిడ్నాప్ చేయాలో ప్లాన్ వేయడంతో పాటు ప్రాక్టీస్ చేసిన రోబోల టీమ్ ఆ తరువాత అమ్మాయిలు వాష్ రూమ్ వాడుకునేందుకు అవకాశం ఇస్తామని తెలిపింది. దివి వాష్ రూమ్ కు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో రోబోల టీమ్ ఆమెను కిడ్నాప్ చేయగా దివి హెల్ప్ హెల్ప్ అంటూ గట్టిగా కేకలు వేసింది.

దీంతో మనుషుల టీమ్ రోబోల టీమ్ పై ఇష్టానుసారం కామెంట్లు చేసింది. రోబోల టీమ్ దివికి భోజనం తినిపించడంతో పాటు ఆమెను బాగానే చూసుకుంది. మెహ‌బూబ్‌, మోనాల్‌, సుజాత, దివిని అడ్డం పెట్టుకుని గేమ్ ఆడినందుకు బాధ పడ్డారు. మొదట మనుషుల టీమ్ సీరియస్ గా ఉన్నా దివి లోపల ఏం జరిగిందో అర్థమయ్యేలా చెప్పడంతో అందరూ కూల్ అయ్యారు. మనుషుల టీమ్ దివిని బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నించగా ఇరు టీమ్ ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

మనుషులు వాష్ రూమ్ వాడుకున్నా చార్జింగ్ ఇవ్వకపోవడంతో హారిక, అరియానా ఒకరినొకరు తిట్టుకున్నారు. ఈరోజు కూడా ఈ టాస్క్ కొనసాగనుంది. మరోవైపు కంటెస్టెంట్ కుమారసాయికి ఇటు మనుషుల టీం కానీ అటు రోబోల టీం కానీ రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. అతను చెప్పే మాటను వినకుండా కూరలో కరివేపాకులా అతనిని చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news