ఓడినా గెలిచిన దేవి.. సేఫ్ అయిన ఫిమేల్ కంటెస్టెంట్..?

-

నిన్న రాత్రి బిగ్ బాస్ సీజన్ 4 నుంచి దేవి నాగవల్లి ఎలిమినేట్ అయ్యారు. అయితే ఎప్పుడూ సీరియస్ గా కనిపించే దేవి ప్రేక్షకుల అభిమానాన్ని గెలవలేకపోయినా ఇంటి సభ్యుల హృదయాలను మాత్రం గెలుచుకున్నారు. ఆమె ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించగానే ఇంటి సభ్యుల హృదయాలు బరువెక్కాయి. దేవి నాగవల్లి ఎలిమినేషన్ తో బిగ్ బాస్ హౌస్ ఒక మంచి కంటెస్టెంట్ ను కోల్పోయిందనే చెప్పాలి.

గత సీజన్లలో ఎప్పుడూ ప్రవేశపెట్టని బిగ్ బాస్ రికార్డ్స్ ను నిన్నటి ఎపిసోడ్ లో ప్రవేశపెట్టారు. బిగ్ బాస్ రికార్డ్స్ లో భాగంగా ఆడించిన గేమ్స్ ఆకట్టుకున్నాయి. అభిజిత్, అమ్మ రాజశేఖర్ కు బెలూన్లను పగలగొట్టే టాస్క్ ఇవ్వగా అభిజిత్ ఓడిపోయి అమ్మ రాజశేఖర్ విజేతగా నిలిచాడు. లాస్య, దేవి నాగవల్లిలకు టాయిలెట్ పేపర్లతో టవర్ కట్టే టాస్క్ ఇవ్వగా ఏ ఒక్కరూ సక్సెస్ కాలేకపోవడం గమనార్హం.

మోనాల్, దివికి యాపిల్స్ తినే టాస్క్ ఇవ్వగా దివి ఎక్కువ యాపిల్స్ తిని విన్నర్ అయింది. సుజాత, అవినాష్ మధ్య జరిగిన బ్రెడ్ స్లైసులు తినే పోటీలో ఎక్కువ బ్రెడ్ స్లైసులు తిని అవినాష్ గెలిచాడు. స్కిప్పింగ్ పోటీలో అఖిల్ విన్ కాగా మెహబూబ్ ఫెయిల్ అయ్యాడు. కుమార్ సాయి, సోహైల్ లలో ఎవరు నోట్లో ఎక్కువ స్ట్రాలు పెట్టుకుంటారో వాళ్లే విన్ అవుతారని చెప్పగా కుమార్ సాయి విజేతగా నిలిచాడు. మొదట మెహబూబ్ ను ఆ తరువాత హారిక, అరియానా సేఫ్ అయినట్టు నాగార్జున ప్రకటించాడు.

చివరకు దేవి నాగవల్లి ఎలిమినేట్ అయిందని తేలడంతో అఖిల్, మెహబూబ్, అరియానా ఏడ్చారు. బిగ్ బాస్ నుంచి హౌస్ నుంచి ఎలిమినేట్ అయినందుకు బాధ పడిన దేవి ఆ బాధను దిగమింగుకుంటూనే పాట పాడింది. నువ్వుంటే నా జతగా అంటూ దేవి పాడిన పాట ఆకట్టుకుంది. ఒకరిని నామినేషన్ నుంచి సేఫ్ చేసే అవకాశం ఇవ్వగా అరియానాను దేవి నామినేషన్ నుంచి సేఫ్ అయ్యేలా చేసింది. బిగ్ బాస్ షోలో దేవి ఓడినా కంటెస్టెంట్ల హృదయాలను మాత్రం గెలిచిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news