బిగ్ బాస్: టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వీళ్లే..!

-

ప్రస్తుతం బిగ్ బాస్ ఆరవ సీజన్ చివరి దశకు చేరుకుంది. చూస్తుండ గానే 13 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని.. ఇప్పుడు 14వ వారంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే మరొక వారంలో బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే కి చేరుకోబోతోంది. ప్రస్తుతం 14వ వారం ఏ ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతారు అన్న విషయం చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. అయితే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో మొదటినుంచి ఎంటర్టైన్మెంట్ లేదు. ఈసారి ఎపిసోడ్ చాలా వరస్ట్ గా ఉంది అంటూ కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే చివరి వారాలు కూడా చప్పగా సాగుతూ ఉండడంతో బిగ్ బాస్ షో నిర్వాహకులపై మండిపడుతున్నారు బిగ్ బాస్ అభిమానులు.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు. వీరిలో ఇద్దరు కంటెస్టెంట్లు ఈవారం ఎలిమినేట్ కాగా ఐదుగురు టాప్ ఫైవ్ లోకి చేరుకున్నారు. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. శ్రీ సత్య, కీర్తి భట్ ఎలిమినేట్ అయ్యి.. బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే టాప్ ఫైవ్లోకి నలుగురు అబ్బాయిలు.. ఒక అమ్మాయి వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఇదే నిజమైతే ఈ వారం శ్రీ సత్య, కీర్తి లు మాత్రం ఎలిమినేట్ అయి బయటకు రావడం ఖాయం అని సమాచారం.

ఇప్పటికే శ్రీహానికి టాప్ ఫైవ్ కి బెర్త్ కన్ఫర్మ్ అవ్వగా.. అతను మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొదటి స్థానంలో రేవంత్ .. అందరికంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా టాప్ పొజిషన్లో ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో రోహిత్ చేరుకున్నాడు. అయితే ఈసారి నాలుగవ స్థానంలో ఇనయ ఉండగా.. ఐదో స్థానంలో ఆదిరెడ్డి ఉండవచ్చు అని అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఇందులో శ్రీ సత్య ను టాప్ ఫైవ్లోకి ఉంచడం కోసం ఆదిరెడ్డిని బలి చేసే అవకాశాలు కూడా ఉన్నట్లుగా సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈవారం ఎలిమినేషన్ పూర్తయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version