సినిమాల విడుదలపై చిరంజీవి మెగా ప్లాన్..

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలోనే తన తదుపరి చిత్రాలపై పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారట మెగాస్టార్. ఇక విడుదల తేదీ విషయమై కూడా చిరంజీవి..ప్లాన్ చేసుకున్నారని సమాచారం.

‘ఆచార్య’ తర్వాత.. చిరంజీవి నటిస్తున్న చిత్రాల్లో విడుదలయ్యేది ‘గాడ్ ఫాదర్’ ఫిల్మ్ అని మేకర్స్ ఇప్పటికే స్పష్టతనిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదీ కోసం మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు అఫీషియల్ తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ పిక్చర్..కు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.

పండుగ కానుకగా సినిమాలు విడుదల చేయాలని ప్రొడ్యూసర్స్ కు మెగాస్టార్ సూచనలిచ్చినట్లు టాక్. అలా ‘గాడ్ ఫాదర్’ పిక్చర్ ఈ ఏడాది దసరా కానుకగా విడుదలయ్యే అవకాశాలున్నాయని సమాచారం.

ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ‘భోళా శంకర్’ విడుదల కానుండగా, ఆ తర్వాత వచ్చే పండుగల్లో వచ్చే ఏడాది ..‘వాల్తేరు వీరయ్య’ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

 

Read more RELATED
Recommended to you

Latest news