ధనుష్ కూడా వస్తున్నాడండి..!

-

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన మారి-2 డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది. ధనుష్ సరసన సాయి పల్లవి జోడీగా నటించిన ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే తమిళంలో డిసెంబర్ 21న రిలీజ్ కాబట్టి తెలుగులో కూడా అదే డేట్ న రిలీజ్ చేయాలని పట్టుబడుతున్నాడట ధనుష్.

తెలుగులో ఆరోజు శర్వానంద్ పడి పడి లేచే మనసు, వరుణ్ తేజ్ అంతరిక్షం సినిమాలు వస్తున్నాయి. అది కాకుండా కన్నడ రాక్ స్టార్ భారీ బడ్జెట్ తో తీసిన కె.జి.ఎఫ్ సినిమా కూడా ఆరోజున వస్తుంది. ఈ మూడు సినిమాలకే థియేటర్స్ సరిపోవట్లేదు అనుకుంటుంటే ఇప్పుడు మారి-2ని కూడా అదే రోజు రిలీజ్ చేయాలని అంటున్నాడట ధనుష్. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రావాల్సిందే ఇది ఫిక్స్ అని చెప్పాడట. ధనుష్ నిర్ణయంతో మారి-2 తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కు షాక్ తగిలినట్టు అయ్యింది. చివరి నిమిషంలో డెశిషన్ ఏమైనా మారుతుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news