సంక్రాంతి వరకు ఎన్.టి.ఆర్, చరణ్ లను కావాలనే లాక్ చేశా …రాజమౌళి

-

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి ప్రాంచైజీ తర్వాత మరో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ వంటి ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు నటిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామ రాజు గా, ఎన్.టి.ఆర్ కొమరం భీం గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ బ్యూటి ఆలియా భట్ చరణ్ సరసన నటిస్తుండగా మరో బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా లుక్స్ కొన్ని లీకయ్యి వైరల్ గా మారాయి.

 

ఇదిలా ఉంటే వాస్తవంగా ఈ సినిమాని సమ్మర్ కి రిలీజ్ చేయాలని జక్కన్న ప్లాన్ చేశారు. ఆ క్రమంలోనే రిలీజ్ డేట్ కుడా అనుకున్నారు. కాని సడన్ గా అందరికి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు జక్కన్న. ఈ సినిమా వర్క్ మొత్తం కంప్లీట్ అవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని అందుకే 2021 జనవరిలో సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నామని డిసైడయి ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. అందుకు కారణం సీ.జి వర్క్ డిలే అవుతుండటమేనని మేకర్స్ చెబుతున్నారు.

 

అయితే ఇప్పుడు వచ్చిన సమస్యంతా తారక్, చరణ్ లకే అని సమాచారం. ఎందుకంటే తారక్ సమ్మర్ తర్వాత త్రివిక్రం తో సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. అలాగే చరణ్ కూడా ఒకరిద్దరిని లైన్ లో పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు జనవరి వరకు కదిలే చాన్స్ లేదని అర్థమవుతోంది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా కంప్లీటయ్యో వరకు ఇద్దరు తనతోనే ఉండేలా చెప్పారట జక్కన్న. ఇదంతా క్వాలిటీ కోసమేనని, బాహుబలి రికార్డ్స్ ని క్రాస్ చేయడానికే అంటూ చెప్పుకుంటున్నారు. మరి ఈ సినిమా ఎన్ని సంచలనాలను సృష్ఠిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news