విద్యాసాగర్‌తో నటి మీనా పెళ్లి తిరుపతిలో ఎవరు జరిపించారో మీకు తెలుసా?

-

ప్రముఖ హీరోయిన్ మీనా..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి. ఇటీవల మీనా భర్త ఊపరితిత్తుల సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేశారు. కాగా, నటి మీనా పెళ్లి ఆంధ్రప్రదేశ్ లోని పుణ్యక్షేత్రం తిరుపతిలో జరిగిందన్న సంగతి చాలా మందికి తెలిసి ఉంటుంది. ఆ పెళ్లి జరిపించింది ఎవరంటే..

నటి మీనా..తన కెరీర్ పీక్స్ లో ఉన్న క్రమంలోనే తల్లి దండ్రులు కుదిర్చిన సంబంధం ఓకే చేసి పెళ్లి చేసుకుంది. విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేసి ఇండియాకు వచ్చి..సొంత కంపెనీ పెట్టుకుని విద్యా సాగర్ తో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది నటి మీనా. 2009లో నటి మీనా పెళ్లి జరిగింది.

మీనా-విద్యాసాగర్ ల మ్యారేజ్ ఏపీలోని తిరుపతి ఆర్య వైశ్యభవన్ లో జరిగింది. వీరి మ్యారేజ్ ను అప్పటి నగరి శాసన సభ్యుడు దురైస్వామి జరిపించారు. దురైస్వామి మీనా కథా నాయికగా నటించిన ‘సీతారామయ్య గారి మనవరాలు’ మూవీని ప్రొడ్యూస్ చేశారు. అలా మీనా పెళ్లి వేడుక తెలుగు నాట జరగడం విశేషం. అనంతరం వీరి రెసెప్షన్ ను చెన్నైలో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news