భార్య తెచ్చిన కట్నంతో బాలయ్య ఏమి చేశారో తెలుసా..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వారసుడిగా అడుగుపెట్టారు బాలయ్య . ఈయన ఎన్నో సినిమాలలో నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ముందుగా బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బాలయ్య తన నటనతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా నటసింహ గా పేరు సంపాదించుకున్నారు.
ఇకపోతే బాలకృష్ణ తన పెళ్ళి సమయానికి ఎన్టీఆర్ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో బిజీగా మారిపోయారు. అయితే ఎన్టీఆర్ భార్య బసవతారకం బాలకృష్ణకు ఎలాగైనా సరే పెళ్లి చేయాలని ఎంతో ఒత్తిడి తీసుకొచ్చారు.

 

ఆ సమయంలో బాలకృష్ణ కి పెళ్లిచూపులు చూసే సమయం కూడా ఎన్టీఆర్ కి లేకపోవడంతో నాదెండ్ల భాస్కర్ రావు కి ఆ బాధ్యతను అప్పగించారు ఎన్టీఆర్. ఈ క్రమంలోనే నాదెండ్ల భాస్కర్ రావు ఒక పెళ్లిలో దేవరపల్లి సూర్యరావు కుటుంబాన్ని ఆయన కూతురు ని చూశారు. అలా బాలకృష్ణకు సరైన జోడి ఆయన కూతురు వసుంధర అని భావించిన భాస్కర్ ఈ విషయాన్ని దేవరపల్లి సూర్యరావు కి తెలియజేశారు.
సాక్షాత్తు ఎన్టీఆర్ లాంటి గొప్పవారితో విజయం అందుకోవడం అంటే అంతకు మించిన అదృష్టం ఇంకేమి కావాలి అని , దేవరపల్లి సూర్యరావు కూడా సంతోషం వ్యక్తం చేయడంతోపాటు వెంటనే నిశ్చయతాంబూలాలు జరిగిపోవాలని చెప్పారట.

ఇక ఎట్టకేలకు బాలకృష్ణ దేవరపల్లి సూర్యరావు కూతురు వసుంధర దేవుని వివాహం చేసుకోవడం జరిగింది. ఈయన ఎవరో కాదు శ్రీ రామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ అధినేత. ఇక ఆ కాలంలోనే వీరి వివాహ సమయంలో దేవరపల్లి సూర్యరావు బాలకృష్ణకు పది లక్షల రూపాయలను కట్నంగా ఇచ్చారు. అయితే ఈ డబ్బులు ఏం చేశారు అనే విషయానికి వస్తే ఎన్టీఆర్ కట్నం డబ్బులు వృధా చేయకుండా బాలకృష్ణ కి వచ్చిన డబ్బుతో వసుంధర పేరుమీద హైదరాబాద్ లో ఒక ఇంటిని నిర్మిం చారు. ఇక అలా అప్పట్లోనే బాలకృష్ణ 10 లక్షల రూపాయలను కట్నం కింద అందుకోవడం తో హాట్ టాపిక్ మారింది.

Read more RELATED
Recommended to you

Latest news