బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఆర్య’ స్టోరి విని రవితేజ చేసిన కామెంట్స్ ఇవే..

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన పిక్చర్ ‘ఆర్య’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ప్లస్ లవ్ స్టోరిలో ఎవరూ ఊహించని ట్విస్టులతో వచ్చిన ఈ పిక్చర్ బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది. కాగా, ఈ సినిమా తీయడానికి దర్శకుడు సుకుమార్ చాలా కష్టపడ్డారు.

ఇక ఈ మూవీ స్టోరిని సుకుమార్..బన్నీతో చేయడాని కంటే ముందు చాలా మంది హీరోలకు వినిపించాడు. స్టోరి విని చాలా బాగుందని అన్నారు. కానీ, ఆ తర్వాత స్టెప్ తీసుకోలేకపోయారు.

అలా ఈ మూవీ స్టోరి మాస్ మహారాజ రవితేజ వద్దకూ వెళ్లింది. సుకుమార్ చెప్పిన స్టోరి విన్న రవితేజ.. స్టోరి చాలా బాగుందని అన్నాడు. కానీ, ఈ స్టోరి తనతో చేయాల్సింది కాదని చెప్పాడట.

ఓ యంగ్ హీరోతో ఈ సినిమా చేస్తే బాగుంటుందని, తనతో కాదని రవితేజ దిల్ రాజు కు చెప్పాడు. అలా ఈ సినిమా స్టోరి అలా ఇలా చాలా మంది వద్దకు వెళ్లి చివరకు అల్లు అర్జున్ వద్దకు వచ్చింది. ఆయన విని ఓకే చేయగా, సినిమా సూపర్ హిట్ అయింది. దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.

ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ -సుకుమార్ కాంబోలకు ఫుల్ క్రేజ్ వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఆ తర్వాత ‘ఆర్య-2’ చేసిన సుకుమార్.. ఇటీవల ‘పుష్ప-1’తో బన్నీని పాన్ ఇండియా స్టార్ చేశాడు. ప్రజెంట్ బన్నీతో ‘పుష్ప-2’ పిక్చర్ చేస్తున్నాడు సుకుమార్. ఇందులో హీరోయిన్ రష్మిక మందన కాగా, విలన్ గా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news