బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్ కు మోదీ ఫోన్.. రాణి ఎలిజబెత్ 2 మృతికి సంతాపం

-

బ్రిటన్ కొత్త ప్రధానికగా ఎన్నికైన లిజ్ ట్రస్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. మహారాణి ఎలిజబెత్ 2 మృతి పట్ల సంతాపం ప్రకటించారు. బ్రిటన్ రాజ కుటుంబానికి, యూకే ప్రజలకు భారత ప్రజల తరపున మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధానిగా ఎన్నికైనందుకు ట్రస్​కు అభినందనలు తెలిపారు.

యూకే విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు ఇరు దేశాల దైపాక్షిక సంబంధాల విషయంలో ఆమె చేసిన కృషిని మోదీ అభినందించారు. త్వరలో తాము ప్రత్యక్షంగా సమావేశం కానున్నట్టు ఇరు దేశాల నేతలు వెల్లడించారు. భారత్​-యూకే మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపరచడానికి ఇరు దేశాల నేతలు కట్టుబడి ఉన్నారని భారత ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. 2030 రోడ్‌మ్యాప్ అమలులో పురోగతి, కొనసాగుతున్న ఎఫ్​టీఏ చర్చలు, రక్షణ-భద్రత సహకారం, ప్రజల మధ్య సంబంధాలతో సహా ద్వైపాక్షిక ఆసక్తికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news