‘‘తమ్ముడు’’ అభిమానిగా ‘‘అన్నయ్య’’..చిరంజీవి-పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పండుగే!

-

తెలుగునాట మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ టాప్ స్టార్స్ గా వారు కొనసాగుతున్నారు. వారి సినిమాలు విడుదలయితే చాలు..అభిమానులు పండుగ చేసుకుంటారు.

 

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’గా ఇటీవల తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అయితే, ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి..తన నెక్స్ట్ ఫిల్మ్స్ పైన ఫోకస్ పెడుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు.

ప్రస్తుతం ఆయన ‘‘గాడ్ ఫాదర్’’, ‘‘భోళా శంకర్’’, ‘‘వాల్తేరు వీరయ్య’’ చిత్రాల షూటింగ్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ‘‘భోళా శంకర్’’ చిత్రానికి సంబంధించిన న్యూస్ ఒకటి ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ న్యూస్ ప్రకారం..‘‘భోళా శంకర్’’ పిక్చర్ లో చిరంజీవి..పవన్ కల్యాణ్ అభిమానిగా కనిపించనున్నారు.

‘‘ఖుషీ’’ సినిమాలోని నడుము సీన్ ను వీరు రీక్రియేట్ చేయనున్నారట. ఇక భూమికగా శ్రీముఖి నటించనుండగా, పవన్ కల్యాణ్ గా చిరంజీవి కనిపించనున్నారని సమాచారం. అయితే, ఈ విషయం తెలుసుకుని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ, పవన్ కల్యాణ్ అభిమానులు మాత్రం మెహర్ రమేశ్ కు జాగ్రత్తలు చెప్తూనే హెచ్చరిస్తున్నారు. ఎవర్ గ్రీన్ సీన్ ను పాడు చేయొద్దని సూచిస్తున్నారు. ‘‘భోళా శంకర్’’ ఫిల్మ్..కోలీవుడ్ స్టార్ హీరో తాలా అజిత్ నటించిన ‘వేదాళం’కు అఫీషియల్ తెలుగు రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news