మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. ‘ఆచార్య’ ట్రైలర్ రిలీజ్ అప్పుడే..

-

తెలుగు చిత్రసీమ ప్రస్తుతం సినిమాల విడుదలతో కళకళలాడుతోంది. గత రెండేళ్లు కరోనా మహమ్మారి వలన థియేటర్స్ క్లోజ్ అయి ఉండగా, ప్రస్తుతం అటువంటి పరిస్థితులు లేవు. జనాలు టాకీసుల బాట పట్టడంతో థియేటర్ల యాజమాన్యాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. పెద్ద చిత్రాల విడుదల ఒక దాని తర్వాత మరొకటి వస్తూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో సినీ అభిమానులు, సినీ పరిశ్రమ వాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్ స్టోరి టెల్లర్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు వసూళ్లు చేస్తూ చరిత్ర తిరగరాస్తోంది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించారు. కాగా, మెగా అభిమానులకు మరో శుభవార్త రాబోతున్నది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, మెగాస్టార్ చిరంజీవి కలిసి నటించిన ‘ఆచార్య’ ఫిల్మ్ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పిక్చర్ ట్రైలర్ రిలీజ్ ను త్వరలో విడుదల చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మేకర్స్ విడుదల చేయగా, మెగా అభిమానులు దానిని ట్రెండ్ చేస్తున్నారు.

గెట్ రెడీ ఫర్ ద మెగా అనౌన్స్ మెంట్.. ఐ ఫీస్ట్ .. మెగా ట్రీట్ అని ఈ సందర్భంగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆచార్య’ మూవీలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా, చెర్రీ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే జత కట్టింది. ఇందులో రెజీనా కసాండ్రా స్పెషల్ సాంగ్ చేయడం విశేషం.

మెలోడీ బ్రహ్మ మణి శర్మ ఈ చిత్రానికి సంగీతం అందించగా, ‘ధర్మస్థలి’లో కష్టాలొస్తే ఆదుకునే మావోయిస్టుగా చిరంజీవి, ధర్మస్థలిలో పని చేసే వ్యక్తి ‘సిద్ధ’గా రామ్ చరణ్ నటించినట్లు ఇప్పటికే విడుదలైన టీజర్స్ ద్వారా స్పష్టమవుతోంది. మొత్తంగా ఈ ఏడాది మెగా అభిమానులు సంబురాలు చేసుకుంటూనే ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news