తన తోడబుట్టిన వాళ్లే తనని డబ్బు కోసం వాడుకున్నారు.. గీతా సింగ్..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో అప్పట్లో లేడీ కమెడియన్గా గుర్తింపు పొందింది గీతా సింగ్. చూడడానికి ఈమె చాలా లావుగా ఉన్నప్పటికీ తన కామెడీతో ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా కితకితలు చిత్రంతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఇక తర్వాత ఎన్నో చిత్రాలలో కామెడీ పాత్రలో నటించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది గీతా సింగ్. అయితే ఈ మధ్యకాలంలో తమ సినిమాల హవ కాస్త తగ్గిందని చెప్పవచ్చు. దీంతో ఈమె అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.

అలా గీతా సింగ్ మాట్లాడుతూ.. ఇంతకాలం కష్టపడి సంపాదించిన డబ్బును మొత్తం ఒక లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర చీటీలు వేసి పోగొట్టుకున్నానని తెలియజేస్తోంది. ముఖ్యంగా నమ్మిన వారే కదా అని తన దగ్గర అధిక మొత్తంలో చీటీ వేయగా సుమారుగా రూ.6 కోట్ల రూపాయల వరకు నష్టపోయానని తెలియజేసింది. ఇక తన వద్ద ఉన్న డబ్బులను మొత్తం కుటుంబ సభ్యులు, స్నేహితులు తనని బాగా వాడుకొని మోసం చేశారని తెలియజేసింది. తన దగ్గర డబ్బులు లేని సమయంలో ఎవరు కూడా తన ఫోన్ కాల్స్ కానీ, తనని కానీ మాట్లాడించేవారు కాదని తెలియజేస్తోంది.

ఇక దీంతో చాలా డిప్రెషన్ కి గురై రెండు మూడుసార్లు ఆర్థిక ఇబ్బందులతో విరక్తి వచ్చి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించానని తెలియజేసింది. అయితే ఇండస్ట్రీలో కేవలం మగవారికి మాత్రమే కమెడియన్గా అవకాశాలు వస్తాయని తెలియజేసింది. అయితే అలా ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆమె స్నేహితురాలు చూసి తనను కాపాడి తనకు జీవితం గురించి హితబోధ చేయడంతో ప్రస్తుతం ఇలా ఉన్నానని తెలిపింది. అయితే తనకి సినీ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టమని అందులో నటించలేకపోయానని బాధ మాత్రం ఇప్పటికీ ఉందని తెలుపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news