ఆ చిత్రం చేయలేకపోయానంటూ బాధపడుతున్న తమిళ్ హీరో జై..

-

కోలీవుడ్(తమిళ్) హీరో జై నటించిన..సినిమాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. అలా హీరో జై తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. ఆయన నటించిన ‘రాజా రాణి, ‘జర్నీ’ పిక్చర్స్ తెలుగులోనూ ఘన విజయం సాధించాయి. అయితే, ఆ తర్వాత కాలంలో జై నటించిన మూవీస్ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో జై తన కెరీర్ లో న్యూ జర్నీ స్టార్ట్ చేశారు.

‘పట్టంబూచి’ పిక్చర్ లో విలన్ గా నటించాడు. ఈ ఫిల్మ్ ప్రమోషన్స్ లో హీరో జై..తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలో విడుదల కానున్న ‘పట్టంబూచి’ చిత్రం ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.

గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విన్నై తాండి వరువాయా’ తెలుగులో ‘ఏ మాయ చేశావే’ పిక్చర్ లో హీరోగా తాను నటించాల్సిందని పేర్కొన్నాడు. ఈ సినిమా ఆఫర్ తొలుత తనకు వచ్చిందని, కానీ, ఆ టైంలో బిజీ షెడ్యూల్ కారణంగా ఆ సినిమాని చేయలేకపోయానని ఫీల్ అవుతున్నాడు హీరో జై.

ఒకవేళ తాను ఆ పిక్చర్ చేసి ఉంటే తన కెరీర్ వేరే లాగా నెక్స్ట్ లెవల్ లో ఉండేదని చెప్తూ బాధపడుతున్నాడు. ఖుష్బు సుందర్ ప్రొడ్యూస్ చేసిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ ‘పట్టంబూచి’కి బద్రి వెంకటేశ్ దర్శకత్వం వహించారు. సుందర్.సి, హనీ రోజ్ వర్గీస్, ఇమ్మాన్ అన్నాచ్చి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమా విజయంపైన మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news