స‌ర్కారు వారి పాట : కీర్తీ ! నీ మాట మ‌ధురం అంటున్న మ‌హేశ్ !

-

మాట మ‌ధురం అయి ఉంటుంది.. పాట కూడా మ‌ధురం అయి ఉంటుంది. మాట, పాట క‌లిసి జీవితాన్ని ముఖ్యంగా ఓ సినిమాను బాగా ప్ర‌భావితం చేసి, భవిష్య‌త్ కాలంలో ఓ సినిమా ఫ‌లితాన్ని నిర్దేశిస్తాయి. ఆ విధంగా స‌ర్కారు వారి పాట కోసం కీర్తి త‌న గొంతుక వినిపించింది. త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకుని మ‌హాన‌టి స్థాయి పేరు తెచ్చుకునేందుకు మ‌రో సారి ప్ర‌య‌త్నించింది. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో !

తెలుగు స్టార్ హీరో ప్రిన్స్ మహేశ్ బాబు, పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం సర్కారు వారి పాట.
రెండేళ్ల కింద‌ట సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లై, బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా కు మహేశ్ లుక్ ను పూర్తిగా మార్చేశారు..ముందుకన్నా ఇంకాస్త స్టయిల్ గా ఈ సినిమాలో మహేశ్‌ కనిపించనున్నాడు. మహానటి ఫేం కీర్తి సురేశ్‌ ఈ చిత్రం లో మహేశ్‌ కు పోటీగా నటిస్తోంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కీర్తి సురేశ్ త‌న పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తీ చేసినట్లు చిత్ర యూనిట్ వ‌ర్గాలు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇంకా ఇత‌ర నిర్మాణాంత‌ర ప‌నులు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. వేసవి కానుకగా ఈ సినిమా మే 12 న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను స్పీడప్ చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సింగిల్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ట్రైలర్ కూడా విడుదల కాబోతోంది.

సినిమా ప్ర‌మోష‌న్ వ‌ర్క్ లో భాగంగా పరశురామ్, కీర్తి సురేశ్, తమన్ దిగిన ఫోటోను ఈ సందర్భంగా షేర్ చేశారు. ‘మహానటి’ చిత్రం నుంచి తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకోవడం మొదలు పెట్టింది కీర్తి సురేశ్. అందులో అత్యంత సహజంగా తన వాయిస్‌ను వినిపించిన కీర్తి.. ‘సర్కారువారి పాట’ చిత్రంలో కూడా అంతే అందంగా తన గొంతును వినిపించబోతోంది. మహేశ్ బాబుతో తొలిసారిగా రొమాన్స్ చేస్తున్న కీర్తి సురేశ్ ఈ సినిమాతో ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటుందో చూడాలిక‌..! ఈ సినిమా కూడా హిట్ అయితే మహేష్ స్పీడ్ ను తట్టుకోవడం కష్టం అనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news