కన్నీళ్లు పెట్టిస్తున్న చంద్రమోహన్ చివరి మాటలు…!

-

 

విలక్షణ నటుడు చంద్రమోహన్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. అయితే చంద్రమోహన్ చివరి మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఈ సందర్భంగా గతంలో ‘నేనొక్కడినే మిగిలాను….’ అంటూ ఆయన చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటున్నారు. ‘సీనియర్ ఆర్టిస్టుల్లో నేనొక్కడినే ఉన్నాను. నా ముందు బ్యాచ్ అంతా వెళ్ళిపోయింది. ఇటీవల నా కొలీగ్స్ అయినా కృష్ణ, కృష్ణంరాజు కూడా వెళ్లిపోయారు. ఆనాటి మేల్ యాక్టర్స్ లో నేనే మిగిలాను’ అని ఆయన ఓ కార్యక్రమంలో చెప్పకొచ్చారు.

కాగా, 80 ఏళ్ల చంద్రమోహన్ గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన చికిత్స పొందుతూ హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌ రావు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జన్మించిన చంద్రమోహన్‌.. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు.1966లో రంగుల రాట్నం సినిమాతో చంద్రమోహన్‌ అరంగేట్రం చేసి.. పలు తమిళ సినిమాల్లోనూ నటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version